
కడప (పెన్నేరు న్యూస్): ఫిబ్రవరి 14:
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ‘స్టాప్, వాష్ అండ్ గో ‘ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం తెల్లవారు జామున నిద్ర మత్తు లేకుండా వాహన డ్రైవర్లకు నీరు అందించి ముఖం కడుక్కుని వెళ్లేలా చర్యలు చేపట్టారు. పోలిసుల తీసుకుంటున్న చర్యలపై వాహన డ్రైవర్లు, ప్రయాణికులు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.



